Andhra Pradesh: ఏపీ వాసులకు అలర్ట్.. కీలక ప్రకటన జారీచేసిన విపత్తుల శాఖ..

Andhra Pradesh: వర్షాకాలం భారీవర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ముందస్తుగా అప్రమత్తమైంది.

Andhra Pradesh: ఏపీ వాసులకు అలర్ట్.. కీలక ప్రకటన జారీచేసిన విపత్తుల శాఖ..
Ap Rains

Andhra Pradesh: వర్షాకాలం భారీవర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ముందస్తుగా అప్రమత్తమైంది. ప్రజలను కూడా అప్రమత్తం చేసింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విపత్తుల సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలోనైనా భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే.. కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు అధికారులు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు:

1. 1070
2. 18004250101
3. 08632377118
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..