Bjp vs Trs RTI War: టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఆర్టీఐ వార్.. ఆ విషయాలన్నీ రాబడతామంటున్న టీఆర్ఎస్..

Bjp vs Trs: ఇటీవల జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో టిట్-ఫర్-టాట్ ప్రచార యుద్ధం, పబ్లిసిటీ బ్లిజ్‌లో మునిగిపోయిన అధికార టిఆర్‌ఎస్..

Bjp vs Trs RTI War: టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఆర్టీఐ వార్.. ఆ విషయాలన్నీ రాబడతామంటున్న టీఆర్ఎస్..
Trs Vs Bjp

Bjp vs Trs: ఇటీవల జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో టిట్-ఫర్-టాట్ ప్రచార యుద్ధం, పబ్లిసిటీ బ్లిజ్‌లో మునిగిపోయిన అధికార టిఆర్‌ఎస్, కాషాయ పార్టీ ఇప్పుడు ఆర్‌టిఐ వార్‌కు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జీతం, వివిధ రాష్ట్రాల పర్యటనల ఖర్చు తదితర వివరాల కోసం తెలంగాణ బీజేపీ 100కు పైగా ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయగా.. టీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా రియాక్ట్ అయ్యింది. ప్రధాని పర్యటన, హామీలు, ఇతర వివరాలు కోరుతూ ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయాలని, తద్వారా బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.

పీఎంవో, కేంద్ర ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, ఇతర కీలక శాఖల నుంచి సమాచారం కోరతామని టీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ ప్రసంగంలో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధాన్ని ఆపింది మోదీయేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారని గుర్తు చేసిన టీఆర్ఎస్ నేతలు.. దేశాల మధ్య యుద్ధాన్ని ఎలా అడ్డుకున్నారో తాము తెలుసుకుంటామని అని అన్నారు. అదొక్కటే కాదు.. ఆర్టీఐ కింద పలు అంశాలపై సమాచారం తీసుకుంటామని తెలంగాణ పీఎస్‌యూ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు.

ప్రధాని ఇతర దేశాల పర్యటనలు, ఖర్చులు, ప్రధానమంత్రి దుస్తులకు ఖర్చు చేసిన మొత్తం, ఇతర వివరాలను కూడా అడగాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. షెడ్యూల్ ప్రకారం కాకుండా మధ్యలో దారి మళ్లి లాహోర్‌కు వెళ్లడం, అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నామని జీవన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..