Maharashtra: ప్రధాని మోదీని కలిసిన మహారాష్ట్ర నూతన సీఎం ఏక్‌నాథ్ షిండే..

Maharashtra: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

Maharashtra: ప్రధాని మోదీని కలిసిన మహారాష్ట్ర నూతన సీఎం ఏక్‌నాథ్ షిండే..
Pm Modi

Maharashtra: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానిని శాలువాతో సత్కరించి.. పాండురంగ స్వామి ప్రతిమను బహుకరించారు. కాగా, నూతన సీఎం, డిప్యూటీ సీఎం లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి భేటీని ధృవీకరిస్తూ పీఎంవో ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయిన ఫోటోలను షేర్ చేశారు. కాగా, ప్రధాని మోదీతో భేటీ కంటే ముందు అంటే శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో సమావేశమయ్యారు సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు పలు అంశాలపై ప్రధాని, హోంమంత్రితో వీరు చర్చించినట్లు తెలుస్తోంది.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..