Supreme Court: మహారాష్ట్రలో షిండే ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ వర్గం
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే వర్గాన్ని ఆహ్వానిస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసింది. The post Supreme Court: మహారాష్ట్రలో షిండే ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ వర్గం appeared first on 10TV.
Supreme Court: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే వర్గాన్ని ఆహ్వానిస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసింది. సోమవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షను కూడా సవాలు చేసింది. తమ వైపు ఉన్న 16 మంది శివసేన ఎమ్మెల్యేలు అనర్హత వేటు ఎదుర్కొంటోన్న వేళ బలపరీక్ష నిర్వహించడం చట్టవిరుద్ధమని చెప్పింది.
Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స
ప్రభుత్వ ఏర్పాటు కోసం ఏక్నాథ్ షిండేను ఆహ్వానించడం, వెంటనే బలపరీక్ష నిర్వహించడం వంటి ప్రక్రియ అంతా శరవేగంగా జరిగిందని ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని శివసేన నేతలు ముందు నుంచీ విమర్శలు చేస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానం కంటే వేగంగా గవర్నర్ కోశ్యారీ చర్యలు తీసుకున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా అన్నారు.
The post Supreme Court: మహారాష్ట్రలో షిండే ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ వర్గం appeared first on 10TV.