Viral Video: పాడుతా తీయగా చల్లగా అంటోన్న చిన్నారి బాలుడు.. నెటిజన్లు బాలుడి గాత్రానికి ఫిదా..

ఓ చిన్నారి అద్భుతంగా కీ బోర్డు ప్లే చేస్తున్నాడు. అంతేనా తన మధుమైన గాత్రంతో పాట కూడా పాడుతున్నాడు. ఆ కుర్రాడు పాట పాడుతున్నప్పుడు ఇచ్చే ఇక్స్‌ప్రెషన్స్‌ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే...

Viral Video: పాడుతా తీయగా చల్లగా అంటోన్న చిన్నారి బాలుడు.. నెటిజన్లు బాలుడి గాత్రానికి ఫిదా..
Viral Video

Viral Video: శిశుర్వేత్తి.. పశుర్వేత్తి..వేత్తి గానరసం ఫణి..అన్నారు పెద్దలు.  సంగీతానికి అమ్మ కడుపులోని శిశువు కూడా పరవసిస్తుందట.. సృష్టిలోని ప్రతి జీవి  సంగీతాన్ని ఆస్వాదిస్తాయట. అంతటి మహిమ ఉన్న సంగీటం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొంతమంది పాడుతుంటే చాలు ఏ పని చేస్తున్నా మానేసి మరీ.. సంగీతం వింటూ ఆ పాటను వింటూ ఆస్వాదిస్తుంటాం. నేటి జనరేషన్ లో కొంతమంది పిల్లలు పుడుతూనే ట్యాలెంట్‌ను తమతో పాటు భూమి మీదకు తెచ్చుకుంటున్నారా అనిపిస్తోంది. చిన్న వయసులోనే ఎన్నో ప్రత్యేకతలు చాటుతున్నారు. ఇదిగో ఇక్కడ ఓ చిన్నారి అద్భుతంగా కీ బోర్డు ప్లే చేస్తున్నాడు. అంతేనా తన మధుమైన గాత్రంతో పాట కూడా పాడుతున్నాడు. ఆ కుర్రాడు పాట పాడుతున్నప్పుడు ఇచ్చే ఇక్స్‌ప్రెషన్స్‌ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే…

ఆ బాలుడు చిన్నప్పుడు స్కూల్‌లో పాడిన‌ ‘గులాబీ ఆంఖే’ పాట అప్పట్లో తెగ వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లవాడు కాస్త పెద్దవాడ‌య్యాడు. ప్రోగా పాడ‌డం మొద‌లెట్టాడు. చక్కగా కీబోర్డు వాయించ‌డం నేర్చుకున్నాడు. ఇప్పుడు కీ బోర్డు వాయిస్తూ ‘మేరే మెహ‌బూబ్ ఖాయ‌మ‌త్ హోగీ’ అంటూ ప్రముఖ సింగర్‌ కిశోర్‌కుమార్‌లా పాడాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్‌ శరణ్ త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో షేర్ చేసారు. ‘మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే’ చిత్రంలోని హిట్‌సాంగ్‌ను ఎంతో హృద్యంగా పాడుతూ అద్భుతంగా కీబోర్డును ప్లే చేస్తున్నాడు ఆ బాలుడు. ఈ వీడియోకు అవ‌నీశ్ శ‌ర‌ణ్ ‘మేడ్ మై డే’ అని క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుటికీ ఇప్పటికీ అత‌డి పాట‌లో మెచ్యూరిటీ క‌నిపించింద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానించారు. “లవ్లీ సాంగ్ అండ్ లవ్లీ సింగర్” అని ఒక యూజర్ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..