Watch Video: తీవ్రంగా నిరాశపరిచిన కోహ్లీ.. ఆకట్టుకున్న జడేజా.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 171 పరుగుల టార్గెట్ను ఉంచింది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 171 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా పెద్ద మార్పు చేసింది. రిషబ్ పంత్తో పాటు రోహిత్ శర్మ బ్యాటింగ్కు వచ్చి, తొలి వికెట్కు 29 బంతుల్లో 49 పరుగులు జోడించారు. రోహిత్ 20 బంతుల్లో 31 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు పడిపోయాయి.