YSRCP Plenary 2022 Day 2 Highlights: వైఎస్సార్‌ సీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌.. ప్లీనరీలో తీర్మానం

CM YS Jagan Speech Highlights: వైఎస్సార్‌ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు ముగిశాయి. రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిన సహాయ సహకారాలు..

YSRCP Plenary 2022 Day 2 Highlights: వైఎస్సార్‌ సీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌.. ప్లీనరీలో తీర్మానం
Ycp

CM YS Jagan Speech Highlights: వైఎస్సార్‌ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు ముగిశాయి. రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిన సహాయ సహకారాలు తదితర అంశాలను వెల్లడించారు. సభలో పలు తీర్మానాలు కూడా చేశారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ను ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టగా, ఇందుకు సభ్యులు ఆమోదం తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన ప్లీనరీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, నేతల ప్రసంగాలతో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు పాల్గొని ప్రసంగాలను విన్నారు. తల్లి విజయమ్మతో కలిసి ప్లీనరీకి హాజరయ్యారు సీఎం జగన్. ముందుగా వైసీపీ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్.. తర్వాత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ఇక వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేసిన విషయం విధితమే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు విజయమ్మ అన్నారు. ఇలాంటి సమయంలో జగన్‌ కన్నా తన అవసరం షర్మిలకే ఎక్కువ ఉందన్న ఆమె పార్టీని అందుకే వీడుతున్నట్లు ప్రకటించారు.

ఇక రెండో రోజు ప్లీనరీ సమావేశాలను రెట్టించి ఉత్సాహంతో నిర్వహించేందుకు వైసీపీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు తీర్మానాలను ప్రారంభించనున్నారు. ఇందులో 5 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎంచుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు జగన్‌ ముగింపు సందేశం ఇవ్వనున్నారు. రెండో రోజు సమావేశాల్లో సుమారు 2 లక్షల మంది హాజరవుతారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.