Kerala : మెడికల్ కాలేజీ క్లాస్ రూంలో విద్యార్ధిని, విద్యార్ధులకు మధ్య కర్టెన్..

 కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో క్లాస్ రూంలో విద్యార్దిని.. విద్యార్ధులకు మధ్య ఓ తెర ఏర్పాటు చేసి క్లాసుని నిర్వహించిన వైనం వివాదాస్పదమైంది. The post Kerala : మెడికల్ కాలేజీ క్లాస్ రూంలో విద్యార్ధిని, విద్యార్ధులకు మధ్య కర్టెన్.. appeared first on 10TV.

Kerala : మెడికల్ కాలేజీ క్లాస్ రూంలో విద్యార్ధిని, విద్యార్ధులకు మధ్య కర్టెన్..

Curtain Separates Male..female Medical Students

Curtain separates male..female medical students : కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో క్లాస్ రూంలో విద్యార్దిని విద్యార్ధులకు మధ్య ఓ తెర ఏర్పాటు చేసి క్లాసుని నిర్వహించిన వైనం వివాదాస్పదమైంది. కేరళలోని త్రిసూర్ లోని ఓ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అనే ఇస్లామిక్ సంస్థ అనే ఇస్లామిక్ గ్రూప్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి అబ్బాయిలు, అమ్మాయిలు హాజరయ్యారు. అలా ఓ వైపు అమ్మాయి..మరోవైపు అబ్బాయిలు కూర్చుకున్నారు. వారి మధ్య ఓ తెర ఏర్పాటు చేసి క్లాసులు నిర్వహించారు. దీంట్లో ఎల్జీబీటీక్యూఐఏ వర్గం (గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్) అనే అంశంపై తరగతులు నిర్వహించారు.

బిహైండ్ రెయిన్ బో ఫ్లాగ్స్… అండర్ స్టాండింగ్ ఎల్జీబీటీక్యూఐఏ ఫ్రం యాన్ ఇస్లామిక్ పర్ స్పెక్టివ్’ పేరిట జరిపిన ఈ క్లాసుల్లో… అమ్మాయిలు ఓవైపు కూర్చోగా..అబ్బాయిలు మరోవైపు కూర్చున్నారు. వారి మధ్యలో ఓ కర్టెన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను సదరు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కు చెందిన సభ్యుడు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది వివాదంగా మారింది.

దీన్ని కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), వామపక్ష విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల మధ్య తెర ఎందుకని ఏ ఒక్కరూ ప్రశ్నించకపోవడం దారుణమని కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విమర్శలు వస్తుండటంతో సదరు ఇస్లామిక్ సంస్థ ఏమాత్రం తగ్గటంలేదు. ‘జెండర్ రాజకీయాల’ గురించి చర్చించడానికి మెడికల్ కాలేజీలో సమావేశం ఏర్పాటు చేశామని చెబుతున్న ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంస్థ తమ చర్యను సమర్థించుకుంటోంది. మేం చేసిందాంట్లో తప్పేమిటి? అని ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంపై తాము పూర్తి సమాచారాన్ని పరిశీలించిన తర్వాత రంగంలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్ యూ) అధ్యక్షుడు కేఎం అభిజిత్ వెల్లడించారు.

కాగా..2021 సెప్టెంబరులో..ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా తాలిబాన్-పాలిత అఫ్ఘానిస్తాన్ లో క్లాసు రూములను విభజించి విద్యార్థిని, విద్యార్ధుల మధ్య కర్టెన్లు ఏర్పాటు చేసింది. కొన్ని క్లాసు రూముల్లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య బోర్డుల్ని ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం లింగ ఆధారిత వివక్షకు సమానమని తాలిబాన్ పాలకులు చెప్పుకొచ్చారు. దీనిపై వివిధ వర్గాల నుండి సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తాలిబన్ల పాలనలో ఇంతకంటే ఇంకేం జరుగుతుందిలే అన్నట్లుగా కూడా అభిప్రాయలు వచ్చాయి.

The post Kerala : మెడికల్ కాలేజీ క్లాస్ రూంలో విద్యార్ధిని, విద్యార్ధులకు మధ్య కర్టెన్.. appeared first on 10TV.