Chandrababu: ఉంగరం వెనుక ఉన్న అసలు రహస్యం చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు..

ఎందుకు ఉంగరం పెట్టాల్సి వచ్చిందో చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏ జోతిష్యుడు చెబితే పెట్టుకోలేదన్నారు. ఆరోగ్యం కోసమే రింగును పెట్టుకున్నాట్లుగా వెల్లడించారు. రింగ్‌లో చిప్ ఉందన్నారు.

Chandrababu: ఉంగరం వెనుక ఉన్న అసలు రహస్యం చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు..
Chandrababu Ring

చంద్రబాబు ఎడమ చేతి వేలికి రింగ్‌‌పై క్లారిటీ వచ్చింది. ఎందుకు ఉంగరం పెట్టాల్సి వచ్చిందో చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏ జోతిష్యుడు చెబితే పెట్టుకోలేదన్నారు. ఆరోగ్యం కోసమే రింగును పెట్టుకున్నాట్లుగా వెల్లడించారు. రింగ్‌లో చిప్ ఉందన్నారు. రింగులో ఉండే చిప్ చంద్రబాబు ఆరోగ్య పరిస్థతిని ఎప్పటికప్పుడు కనిపెట్టి.. ఆ వివరాలను వైద్యులకు వెల్లడిస్తుందన్నారు. అయితే.. చంద్రబాబు ఎడమ చేతి వేలికి రింగ్‌ కనిపించడంతో మీడియాలో పెద్ద వార్తగా మారింది. జులై 1 నుంచి చంద్రబాబు ఎడమ చేతికి ఈ రింగ్‌ పెట్టుకున్నారు. ఆరోజు పెట్టిన ప్రెస్‌మీట్‌తో పాటు నిన్న జరిగిన మదనపల్లి మహానాడు సభలో చంద్రబాబు చేతికి రింగ్‌ కనిపించింది. దీంతో  ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది.  40 ఏళ్ల రాజకీయం జీవితం.. సాదాసీదా జీవితం. జేబులో పెన్నుతో మాత్రమే చంద్రబాబు కనిపించేవారు. చేతికి వాచీ కూడా పెట్టుకునేవారు కాదు. కానీ ఎడమ చేతి చూపుడు వేలుకు ఇప్పుడు రింగ్‌ పెట్టుకుంటున్నారు. ఈ సడెన్‌ ఛేంజ్‌ వెనుక రీజనేంటి? బాబు సెంటిమెంట్‌గా మారారా? ఒక్కసారి ఇక్కడ పరిశీలింద్దాం.

చంద్రబాబు ఇంతకుముందు సింపుల్‌గా ఉండేవారు. తనకు సెంటిమెంట్లు లేవని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఈ ఉంగరం సెంటిమెంట్‌గా మారిందా? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు నడిచాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..