PM Kisan: ఆ లిస్టులో మీ పేరుందా.. అయితే, డబ్బులు రీఫండ్ చేయాల్సిందే.. పీఎం కిసాన్ సరికొత్త రూల్స్..

PM Kisan: అర్హత లేకుండా సహాయం పొందితే, కచ్చితంగా డబ్బును తిరిగి ఇవ్వాల్సిందేనని, లేదంటే మున్ముందు వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

PM Kisan: ఆ లిస్టులో మీ పేరుందా.. అయితే, డబ్బులు రీఫండ్ చేయాల్సిందే.. పీఎం కిసాన్ సరికొత్త రూల్స్..
Pm Kisan Scheme

దేశంలోని అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. దీని కింద అన్నదాతలకు ప్రతీ సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తుంది. ఏడాదికి 3 సార్లు ఆర్థిక సహాయాన్ని అందించి, పెట్టుబడికి కష్టాలను కొంతమేర తీర్చుతుంది. అయితే ఈ పథకంలో అర్హత లేని అన్నదాతలు ఎంతోమంది ఉన్నారంటూ, పలు నివేదికలు వెలవడ్డాయి. దీంతో ప్రభుత్వం త్వరలో అలాంటి వారకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

  1. ఈమేరకు అర్హత లేని అన్నదాతలు పొందిన ఆర్థిక సహాయాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించేలా ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హత లేకుండా సహాయం పొందితే, కచ్చితంగా డబ్బును తిరిగి ఇవ్వాల్సిందేనని, లేదంటే మున్ముందు వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
  2. ఈమేరకు అన్నదాతలకే ఓ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనే తగిని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు తెలుసుకునేందుకు పీఎం కిసాన్ వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి వెల్లి, చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో ‘రీఫండ్ ఆన్‌లైన్’ అనే ఆఫ్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి వివరాలను చెక్ చేసుకోవాలి.
  3. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు సబ్మిట్ చేశాక, ‘యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ రీఫండ్ అమౌంట్’ అనే మెసేజ్ కనిపిస్తే.. ఆర్తిక సహాయాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. అలాకాకుండా ‘రీఫండ్ అమౌంట్’ అనే ఆప్షన్ కనిపిస్తే ఆర్థిక సహాయాన్ని తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు త్వరలోనే ఓ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.