Tirumala Updates: శ్రీవారి భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల - దర్శనానికి ఎంత టైమ్ పడుతుందంటే

Heavy Rush In Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా గత రెండు నెలల నుంచి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబాలతో పాటు భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునేందకు భక్తులకు ఒకరోజు సమయం పడుతుంది. స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న వారికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న సైతం భారీగానే ఆదాయం..  శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనార్థం క్యూ లైన్లలో భక్తులు ఉన్నారు. కంపార్ట్ మెంట్ల వెలుపల ఆస్థాన మండపం వరకు భక్తులు శ్రీవారి దర్శనార్థం ఎదురుచూస్తున్నారు. దాంతో స్వామివారి దర్శనానికి ప్రస్తుతం భక్తుకు 24 గంటల సమయం పడుతోంది. జూలై 9న స్వామివారిని 87,478 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 48,692 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజు తిరుమలలో శ్రీవారి హుండీకి రూ.4.53 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..  శ్రీవారి భక్తులకు టీటీడీ అప్‌డేట్ ఇచ్చింది. తిరుమలలో ఒక్కరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో జూలై 11న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. జూలై 17 న ఆదివారం అస్థానం సందర్బంగా తిరుమల శ్రీ‌వారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా జూలై 12న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేయడం జరిగిందని, ఈ కారణంగా జూలై 11న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం టికెట్లు విడుదల..జూన్ 6న ఉదయం 9 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈ మంగళవారం నాడు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం భక్తులకు ఈ నెల 12, 15, 17 తేదీలలో స్వామివారిని దర్శించుకునేందుకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను దేవస్థానం నేడు విడుదల చేసింది. రూ.300 టికెట్ల స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేసినట్లు టీటీటీ అధికారులు తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.Also Read: Tirumala : గోఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, మార్క్ ఫెడ్ తో టీటీడీ ఒప్పందం కరోనా తరువాత హుండీకి భారీ ఆదాయం2018 జూలై 26న రికార్డు స్థాయిలో రూ.6.28 కోట్ల కానుకలు శ్రీవారి హుండీకి వచ్చాయి. ఆ తరువాత దాదాపు మూడేళ్లకు దాదాపుగా అదే స్థాయిలో హుండీకి కానుకలు చేరాయి. సోమవారంనాడు రికార్డు స్థాయిలో రూ. 6.18 కోట్ల కానుకలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో రెండోసారి 6 కోట్ల రూపాయలు పైగా కానుకలు హుండీలో సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

Tirumala Updates: శ్రీవారి భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల - దర్శనానికి ఎంత టైమ్ పడుతుందంటే

Heavy Rush In Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా గత రెండు నెలల నుంచి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబాలతో పాటు భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునేందకు భక్తులకు ఒకరోజు సమయం పడుతుంది. స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న వారికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

నిన్న సైతం భారీగానే ఆదాయం..  
శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనార్థం క్యూ లైన్లలో భక్తులు ఉన్నారు. కంపార్ట్ మెంట్ల వెలుపల ఆస్థాన మండపం వరకు భక్తులు శ్రీవారి దర్శనార్థం ఎదురుచూస్తున్నారు. దాంతో స్వామివారి దర్శనానికి ప్రస్తుతం భక్తుకు 24 గంటల సమయం పడుతోంది. జూలై 9న స్వామివారిని 87,478 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 48,692 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజు తిరుమలలో శ్రీవారి హుండీకి రూ.4.53 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..  శ్రీవారి భక్తులకు టీటీడీ అప్‌డేట్ ఇచ్చింది. తిరుమలలో ఒక్కరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో జూలై 11న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. జూలై 17 న ఆదివారం అస్థానం సందర్బంగా తిరుమల శ్రీ‌వారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా జూలై 12న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేయడం జరిగిందని, ఈ కారణంగా జూలై 11న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

షెడ్యూల్ ప్రకారం టికెట్లు విడుదల..
జూన్ 6న ఉదయం 9 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈ మంగళవారం నాడు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం భక్తులకు ఈ నెల 12, 15, 17 తేదీలలో స్వామివారిని దర్శించుకునేందుకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను దేవస్థానం నేడు విడుదల చేసింది. రూ.300 టికెట్ల స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేసినట్లు టీటీటీ అధికారులు తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.
Also Read: Tirumala : గోఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, మార్క్ ఫెడ్ తో టీటీడీ ఒప్పందం

కరోనా తరువాత హుండీకి భారీ ఆదాయం
2018 జూలై 26న రికార్డు స్థాయిలో రూ.6.28 కోట్ల కానుకలు శ్రీవారి హుండీకి వచ్చాయి. ఆ తరువాత దాదాపు మూడేళ్లకు దాదాపుగా అదే స్థాయిలో హుండీకి కానుకలు చేరాయి. సోమవారంనాడు రికార్డు స్థాయిలో రూ. 6.18 కోట్ల కానుకలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో రెండోసారి 6 కోట్ల రూపాయలు పైగా కానుకలు హుండీలో సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.