IND vs ENG 3rd T20: మలాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. రోహిత్ సేన ముందు భారీ టార్గెట్.. విఫలమైన భారత యువ బౌలర్లు..
టీ20 సిరీస్లో మూడో, చివరి మ్యాచ్ నాటింగ్హామ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఇందులో భారత్ ముందు 216 పరుగుల విజయ లక్ష్యం ఉంది.
England vs India 3rd T20I Nottingham: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్లో మూడో, చివరి మ్యాచ్ నాటింగ్హామ్ వేదికగా జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్ ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. డేవిడ్ మలన్ తుఫాను ప్రదర్శనతో కేవలం 39 బంతుల్లో 77 పరుగులు చేసి, భారత యువ బౌలర్లపై ప్రతాపం చూపించాడు. అలాగే మరో బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ కూడా 29 బంతుల్లో 42 పరుగులు చేసి, ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. భారత్ తరపున రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు.